ముస్లింల బాధ – అనాధల బాధ!!

“కృష్ణశాస్త్రి బాధ – ప్రపంచం బాధ,
ప్రపంచంపు బాధ – శ్రీశ్రీ బాధ”

ఇది అప్పుడెప్పుడో చలం చెప్పిన మాట.
ప్రస్తుత కాలానికి మార్చి రాస్తే,

“ముస్లింల చేతిలో ఎవరైనా బాధలు అనుభవిస్తే – అది ప్రపంచపు బాధ,
ముస్లింలు ఎవరిచేతిలోనైనా బాధలకు గురైతే – అది అనాధల బాధ” – అని చెప్పాల్సి ఉంటుంది.

సద్దాం హుస్సేన్ – తన అధికారాన్ని సుస్థిరం చేసుకోవడానికి, ఇరాక్ లోని కొన్ని తెగలపై అణచివేత చర్యలు చేపట్టాడు. నియంతలెవరైనా చేసేది అదే కదా. కానీ, ఆ బాధిత తెగల బాధ ప్రపంచం బాధైంది. సద్ధాం హుస్సేన్ చేసిన అకృత్యాలను పదింతలు చేసి, ప్రపంచ మీడియా పదే,పదే ప్రసారం చేసింది. అతని దగ్గర జనహనన ఆయుధాలున్నాయని నాటో దలాలు ఇరాక్ పై దండయాత్ర చేసి సద్దాం ను మట్టుపెట్టాయి. అంతా ఐపోయాక, అశ్వద్దామతహ కుంజరహా అన్నట్లు – ‘జనహనన ఆయుధాలు ‘ ప్రపంచజనాలను వెర్రోల్లను చేయడానికి వాడిన పాచిక మాత్రమే అని అగ్రరాజ్యాలు పళ్ళికిలిస్తూ చెప్పాయి.
ఇరాక్ పై వివిధ రకాల ఆంక్షలు విధించి – అక్కడ మందులు దొరక్కుండా చేసి, 5 లక్షల మంది చిన్నారులు చనిపోయిన విషయం మాత్రం, ప్రపంచం బాధ అవ్వదు.

Continue reading “ముస్లింల బాధ – అనాధల బాధ!!”