వెల్డన్ బీజేపీ – గుడ్ లక్ సాధ్విప్రఞాసింగ్!!

వెల్డన్ బీజేపీ – గుడ్ లక్ సాధ్విప్రఞాసింగ్!!

==========================

  ఎన్నికల్లో గెలవాలనినేను  కోరుకున్నఅబ్యర్థులు ఇప్పటివరకూ ఇద్దరు– కణయకుమార్ప్రకాష్ రాజ్ఇప్పుడు మరోమూడో అబ్యర్థి కూడా గెలవాలనికోరుకుంటున్నాను – ఆమె – సాధ్వీ ప్రఞాసింగ్ఈమె బీజేపీ తరుపున భోపాల్నుండీ పోటీ చేస్తుందిమొదటి ఇద్దరూగెలిచే అవకాశాలు చాలా తక్కువకానీ మూడో అభ్యర్థి గెలిచే అవకాశంమాత్రం చాలా చాలా ఎక్కువ.

 ఈమె గురించి తెలియాలంటే – అభినవ్భారత్ అనే సంస్థమాలేగావ్ పేలుల్లు,సంఝవ్తా ఎక్స్ప్రెస్ రైల్లో పేలుడు,మక్కామజీద్అజ్మీర్ పేలుల్లు వీటన్నిటి గురించీతెలుసుండాలి.

 2006 లోమహారాష్ట్రాలోని మాలేగావ్లో మసీదులో పేలుడు జరిగి 40 మందిచనిపోయారు.

2007 లోభారత్పాక్ మధ్య తిరిగేసంఝవ్తా రైల్లో బాంబు పేలి 70 మందిచనిపోయారుతర్వాత జరిగిన,హైదరాబాద్ లోని మక్కా మసీదు బాంబుపేలుడుఅజ్మీర్ దర్గా బాంబు పేలుల్లగురించి తెలిసిందే.

 యధాలాపంగాపేల్లులు జరిగిన మరుసటి రోజునే సిమీలష్కరే తోయిబా,జైసే మహమ్మద్హర్కతుల్ ముజాహిద్వంటి వివిధ అరబిక్ పేర్లు తెరమీదికిరావడంచాలా మంది ముస్లింలనుఇండ్లలో నుండీ పోలీసులుఎత్తుకెళ్ళడమూమీడియా ‘తీవ్రవాదులుదొరికేశారని ‘ ప్రకటించడమూచక చకాజరిగిపోయాయి.

 కానీహేమంత్ కర్కరే అనే  మహారాష్ట్రఐపీయస్ ఆఫీసర్ కి దొరికిన కూపీ నిపట్టుకుని లాగితేదాని వెనకే పెద్ద డొంకేకదిలిందిసాధ్వీ ప్రగ్ఞాసింగ్స్వామీఅసిమానంద్కల్నల్ పురోహిత్సునీల్జోషీ వంటి వారి అరెస్టులు వేగంగాజరిగిపోయాయివీరందరూ,ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ కలిశారుఏంప్లాన్స్ చేశారుఎవరి పాత్ర ఏమిటి,ఇవన్నీ డీటైల్ గా బయటికి వచ్చాయి.పక్కాగా చార్జ్ షీట్ దాఖలయ్యేసమయంలోహేమంత్ కర్కరే ముంబై పైజరిగిన తీవ్రవాద దాడిలో ప్రాణాలుకోల్పోయారుఆయన ఎలా చనిపోయారుఅనేది ఇంకో పెద్ద కథఓపికున్నోల్లుగూగుల్ సెర్చ్ చేసి తెలుసుకోండిలేదంటే ‘హూ కిల్డ్ హేమంత్ కర్కరే’  అనే పుస్తకంచదవండి.

 పైన అరెస్టైన వారిపేర్లలో ఒకటి స్వామీఅసిమానంద్.  ఈయన్ను  కేసువిచారణ నిమిత్తం హైదరాబాద్లోని చెర్లపల్లిజైలుకు తీసుకొచ్చారుజైల్లో అతనికికలీం అనే యువకుడుపరిచయమయ్యాడుచాలా మృదుస్వభావిఅందరితో కలుపుగోలుగాఉండేవాడువృద్ధుడనే కారణంతో స్వామికి కూడా చాలా సపరిచర్యలు చేసేవాడు.ఒకానొకరోజు  “ కేసు మీద నిన్ను అరెస్టుచేశారని”  కలీం ని స్వామి అడిగాడు. – “మక్కా మసీద్ పేలుళ్ళ కేసు”-  అని కలీంచెప్పగానేస్వామి అసిమానంద్ షాక్అయ్యాడుతనకు అస్సలు ఏమాత్రంసంబంధం లేని కేసులో జైల్లో మగ్గుతున్నకలీం పై ఎక్కడలేని సానుభూతి కలిగింది.తాను ఎంత పెద్ద పాపం చేస్తున్నాడోఅర్థమైందివెంటనే మెట్రోపాలిటన్మెజిస్ట్రేట్ ముందు కు  వెళ్ళిపేలుళ్ళవెనుక జరిగిన తతంగమంతాపూసగుచ్చినట్లు వివరించాడుఇదిఅధికారిక రికార్డుల్లో నమోదైందిమీడియాలోనూ హేడ్లైన్స్ లో వచ్చింది.అఫ్కోర్స్  తర్వాత కొన్నేల్లకు ఆయన – “అబ్బే గతంలో నేను చెప్పిందంతాతూచ్.. నాకు పేలుళ్ళగురించి అస్సలేంతెలీదు” అని మాట మార్చారుఇది వినిజడ్జిగారూ NIA, CBIవీరందరూ… “తూచా.. ఐతే పర్లేదు” –  అని ఆయనరెండో సారి చెప్పిందాన్ని నమ్మేసి,మొదటిసారి చెప్పిందాన్ని ఇగ్నోర్ చేశారు. తర్వాతప్రభుత్వాలు మారడంపైనపేర్కొన్న నిందితులపై ఒక్కో కేసూకొట్టేయడంఅందరూ పునీతులుగాబయటికి రావడం.. అంతా తెలుగుసినిమా క్లైమాక్స్ లాగా..  హ్యాపీ ఎండింగ్అన్నట్లు.

  రకంగా బయటికి వచ్చిన సాధ్వీ ప్రగ్ఞాసింగ్ ఇప్పుడు భోపాల్ లో ఎంపీగా పోటీచేస్తుందినేను ఈమె గెలవాలనికోరుకోవడానికి అసలు కారణంఆమెపోటీ చేస్తున్నది కాంగ్రెస్ ని ఇన్నాల్లూనడిపిన ముసలి నక్కల్లో ఒకరైనదిగ్విజయ్ సింగ్ మీదఇప్పుడు ముసలి నక్కసాధ్వీకి వ్యతిరేకంగా ఎలాప్రచారం చేస్తాడా అనేది ఆసక్తికరమైనఅంశంఆమె తీవ్రవాది కాబట్టి ఆమెకుఓట్లేయొద్దని అనలేడుఎందుకంటేఆమెతీవ్రవాది ఐతే,  ఇంతకు ముందుకేంద్రంలోనూరాష్ట్రంలోనూ అధికారంలోఉన్న మీ కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏంపీకాయని ఎవరైనా నిలదీసిఅడుగుతారుప్రజలడక్కున్నాఅర్నాబ్గోస్వామీ లాంటి విలేఖరములుగొంతుచించుకుని మరీ అడుగుతారు.దీనికి సమాధానం కాంగ్రెస్ దగ్గర లేదు.పైగాకేవలం హిందువుని ఐనందుకేకాంగ్రెస్ తనని జైలు పాలు చేసిందనీ,దానికి బుద్ధి చెప్పమనీ సాధ్వీ ప్రగ్ఞా సింగ్ప్రతి మీటింగ్లోనూ తన గోడువెల్లబోసుకుంటుంది రకంగా ఇదికాంగ్రెస్ కి చావు దెబ్బ

 అన్నట్లు,  ఇక్కడే ‘మౌత్ కీ సౌదాగర్’ సంగతి గుర్తుకొస్తుంది.

 2002 గుజరాత్ ముస్లిం నరమేధంతర్వాత జరిగిన గుజరాత్ ఎన్నికలప్రచారంలో,  సోనియా గాంధీనరేంద్రమోడీని మౌత్ కా సౌదాగర్చావులతోవ్యాపారం చేసేవాడు)  అని చాలా సార్లుపిలిచింది. “నేను సరైన పనే చేశానుకానీసోనియా గంధీమీ సాటి గుజరాతీనిపట్టుకుని మౌత్ కా సౌదాగర్ అంటుందిచూశారా” అని మోడీ వగలమారిడైలాగులు విసిరారుమొత్తానికి ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయిందిఆమెమోడీని మౌత్ కా సౌదాగర్ అనబట్టే ,  మోడీ కి గుజరాతీల్లో సానుభూతివచ్చిందనీసోనియా గుజరాత్ అల్లర్లనుప్రస్తావించకుండా ఉండాల్సిందనీ,దిగ్విజయ్ సింగ్ లాంటి నక్కలుతీర్మానించేశాయి.  దాని ఫలితంగా, 2007గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో , సోనియాగాంధీ గుజరాత్ అల్లర్ల ప్రస్తావనమాటమాత్రం కూడా లేకుండా ప్రచారంచేసింది రకంగా మోడీపై గుజరాత్అల్లర్ల మరక తొలగిపోవడంలో కాంగ్రెస్ఇతోధికంగా సహాయం చేసింది.

 ముస్లింలు నిందితులుగా ఉన్న కేసుల్లోమాత్రం ఫాస్ట్ ట్రాక్ కోర్టులుఆఘమేఘాలమీద విచారణలుశిక్షలు

NIA,CBI,STAకోర్టులున్యాయ వ్యవస్థ,సాయుధబలగాల్లో సెక్యులరిజానికితూట్లు పొడిచేలామెజారిటీమతభావజాలం చొచ్చుకుపోతున్నసంకేతాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాతనకేమీ పట్టనట్లు నిమ్మకు నీరెత్తినట్లుఉండటం

ప్రతీ అంశాన్నీ రాజకీయంగా మనకుబెనిఫిటాకాదా అనే చూడటం – ఇవీకాంగ్రెస్ పార్టీ ట్రేడ్ మార్క్ విధానాలు.ఇలాంటి కాంగ్రెస్ రాజకీయాలకునిలువెత్తు ప్రతినిధి దిగ్విజయ్ సింగ్.ఇనాల్లూ  రాజకీయాలకు ముస్లింలు,ఇతర మైనారిటీలే బలయ్యారు.మొదటిసారి దాని ప్రత్యక్ష ఫలితాన్నిదిగ్విజయ్ సింగ్ అనుభవించబోతున్నాడు.  వెల్డన్ బీజేపీ,గుడ్ లక్ సాధ్వీ ప్రగ్ఞా సింగ్.

 -శుక్రవారం.ఇన్.

Leave a Reply

Your email address will not be published.