(దిప్రింట్ కి ,ఇంగ్లీష్ లో రాసిన వ్యాసానికి తెలుగు అనువాదం.)
కులం గురించి గత 14 సంవత్సరాలుగా రీసెర్చ్ చేస్తున్నాను,
‘దలిత్ కెమెరా’ ఛానెల్ కోసం, దలితులకు సంబంధించిన అనేక అంశాలపై 8 ఏళ్ళపాటు వివిధ డాక్యుమెంటరీలు షూట్ చేశాను. ఈ మొత్తం ప్రయాణం ద్వారా ఒక్క అంశం మాత్రం తిరుగులేని నిజమని అర్థమైంది. అది – బాబా సాహెబ్ అంబేద్కర్ చెప్పినట్లు, “కులాన్ని ఎదుర్కొనే ఏకైక మార్గం – హిందూఇజం ని వదిలేయడమే.”
ఆయన అడుగుజాడల్లోనే నడిచి, నేను కూడా జనవరి 30, 2020 తేదీన, కేరళ త్రిస్సూర్ జిల్లాలోని చారిత్రాత్మక ప్రాంతమైన కొడుంగల్లూర్ లో హిందూమతాన్ని వదిలేసి – ఇస్లాం స్వీకరించాను. భారతదేశంలో మొట్టమొదటి మసీదు కొడుంగల్లూర్ లోనే కట్టబడింది. ఇప్పుడు నేను ‘రాయీస్ మహమ్మద్’ ని.